ఏపీ, తెలంగాణలో కోక-కోలా ఇండియా సురక్షిత తాగునీటి ప్రాజెక్టు

ABN , First Publish Date - 2020-09-23T23:04:36+05:30 IST

ఏపీ, తెలంగాణలో కోక-కోలా ఇండియా సురక్షిత తాగునీటి ప్రాజెక్టు

ఏపీ, తెలంగాణలో కోక-కోలా ఇండియా సురక్షిత తాగునీటి ప్రాజెక్టు

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సురక్షిత తాగునీటి ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్లు కోక-కోలా ఇండియా ఫౌండేషన్ ఆనందన ప్రకటించింది. కోకో – కోలా ఇండియా ఫౌండేషన్ ఆనందన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాలలో జలధార ఫౌండేషన్, వాటర్ హెల్త్ ఇండియాలతో కలసి ఏడు వాటర్ హెల్త్ సెంటర్స్ (డబ్ల్యూహెచ్‌సీ) కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ జిల్లాలకు చెందిన 20,000 మందికి నీటి శుద్ధి కేంద్రాలు, సురక్షిత తాగు నీటిని వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తేవడం ద్వారా ఇక్కడ ప్రజల ఆరోగ్యం మెరుగు దలకు కృషి చేస్తోంది. గ్రామీణులు నీళ్ల ద్వారా వ్యాప్తి చెందే రోగాల బారిన పడడాన్ని తగ్గించేందుకు తోడ్పడి నట్లవుతుంది. 


మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో కూడా ఈ తరహా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఇదే విధమైన ప్రాజెక్టులను ఈ ఫౌండేషన్ చేపట్టింది. ‘‘జీవించేందుకు నీళ్లు తప్పనిసరి అని, ఆర్యోగవంతమైన సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక సురక్షిత తాగు నీళ్లని అంజాద్ తెలిపారు. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయడంలో మరియు అక్కడి ప్రజలపై సానుకూల ప్రభావం కనబర్చడంలో జలధార ఫౌండేషన్, వాటర్ హెల్త్ ఇండియా తోడ్పడ్డాయి. 


‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నీటి ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందడం అధికమవడం, దానికి తోడు పరిశ్రమ వర్గాల నివేదికల ప్రకారం భూగర్భజలాలు నిరంతరం కలుషితం కావడం ఈ ప్రాంతాల ప్రజల తాగునీటి కష్టాలకు నిదర్శనంగా ఉంటున్నాయని జలధార ఫౌండేషన్ ప్రతినిధి శ్రీ బి.రామానంద్ తెలిపారు. నీటి పరిష్కారాలను అమలు చేసినప్పుడు గ్రామీణులు దీర్ఘకాలంలో గొప్ప ప్రయోజనాలు పొందగలుగుతారని తాము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. 


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పలు తక్కువ ఆదాయ వర్గాలు శుభ్రమైన తాగునీటి సదుపాయం లేకపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. భూగర్భజలాలు కలుషితం కావడం అనేది నీటి ద్వారా వచ్చే వ్యాధులు అధికమయ్యేలా చేస్తోంది. అది సమాజ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.ఈ జిల్లాలకు చెందిన పలు భూగర్భ జల నమూనాల్లో లవణీయత, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఐరన్, నైట్రేట్ అనేవి కీలకమైన కాలుష్యకారకాలుగా ఉంటున్నాయి. పరిశ్రమలు విడుదల చేసే కలుషితాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. తాగు నీటి సరఫరాకు వీలు లేకపోవడంతో ప్రజలు తప్పనిసరై శుద్ధి చేయని బోర్ పంపు నీళ్లను తాగాల్సి వస్తోందని అన్నారు. 


ఈ ప్రజలకు తోడ్పడేందుకు కోక – కోలా ఇండియా ఫౌండేషన్ ఆనందన వాటర్ హెల్త్ సెంటర్స్ (డబ్ల్యూహెచ్ సీ) లు గా వ్యవహరించే ఏడు నీటి శుద్ధి మరియు పంపిణి కేంద్రాలకు అండగా నిలిచింది. ప్రజలకు సురక్షిత, పరిశుభ్రమైన నీటిని అందుబాటు ధరలో అందిస్తున్నాయి. వాటర్ హెల్త్ సెంటర్స్ (డబ్ల్యూహెచ్ సీ) ఏర్పాటు అనేది ఈ ప్రాంతంలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధికి కూడా తోడ్పడుతోంది. తద్వారా ఈ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి కూడా  తోడ్పడుతోంది. సమాజాభివృద్ధి, సమగ్ర మెరుగుదలకు నీటి సంరక్షణ, యాజమాన్యం దిశగా పని చేసేందుకు కోక – కోలా ఇండియా ఫౌండేషన్ ఆనందన కట్టుబడి ఉంది. 2007 నుంచి కూడా ఈ ఫౌండేషన్ 150కి పైగా వాటర్ రిప్లెనిష్ మెంట్ నిర్మాణాలను నెలకొల్పింది. వీటి సామర్థ్యం 13 బిలియన్ లీటర్లకు పైగా ఉంటుంది. 550కి పైగా గ్రామాల్లో 8,00,000 కుపైగా జీవితాలను కాపాడుతోంది.


Updated Date - 2020-09-23T23:04:36+05:30 IST