AP CM JAGAN ఎన్నికల సైరన్ మోగించారా?

ABN , First Publish Date - 2022-04-28T01:01:08+05:30 IST

మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతల పని తీరుపై..

AP CM JAGAN ఎన్నికల సైరన్ మోగించారా?

అమరావతి: మంత్రులు, ఎమ్మెల్యేలతో CM JAGAN సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతల పని తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా తన GRAPH 65 శాతం ఉందని, ఎమ్మెల్యేల్లో చాలా మందికి 40 నుంచి 45 శాతమే గ్రాఫ్‌ ఉందని, ఎన్నికల నాటికి అందరి గ్రాఫ్‌ పెరగకపోతే మార్పులు తప్పవని జగన్‌ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్..  వాస్తవాలను చెప్పే మీడియాపై అక్కసు వెళ్ల గక్కారు. తమ పోరాటం చంద్రబాబుతోనే కాదని.. మీడియాతో కూడా అని చెప్పారు. సాక్షి టీవీ, పేపర్‌ ద్వారా పార్టీకి అనుకూలంగా విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. 


ఎమ్మెల్యేల పని తీరు, గ్రాఫ్‌ పడిపోతే వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వనని... పక్కన పెడతా JAGAN హెచ్చరించారు. ఎమ్మెల్యేల పని తీరు నివేదికలు తన దగ్గర ఉన్నాయని, కొంతమంది గ్రాఫ్‌ కిందకు.. మరికొంతమంది గ్రాఫ్‌పైకి ఉందన్నారు. గ్రాఫ్‌ తగ్గిన వాళ్లను తొలగిస్తామని తేల్చి చెప్పారు. రెండేళ్లలో ఎన్నికలకు వెళుతున్నామని, 151 సీట్లకు ఒక్క సీటు తగ్గకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. సంక్షేమం అందరికీ అందిస్తున్నామని.. 175 SEATS ఎందుకు రాకూడదని జగన్ ప్రశ్నించారు. జిల్లాలో అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మంత్రులదే అని సీఎం జగన్ వెల్లడించారు. ప్రతిపక్షం, మీడియా లేనివి ఉన్నట్టు చెబుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేతలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలని..మళ్లీ గెలిపిస్తేనే మంత్రి పదవులు వస్తామని జగన్ చెప్పారు. మే 10 నుంచి గడపగడపకు వైసీపీ కార్యక్రమం, ఇంటింటికీ కలిగిన ప్రయోజనాలను బుక్‌లెట్‌ తీసుకొని వెళ్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశించారు. 


వైసీపీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘ఏపీ సీఎం జగన్ ఎన్నికల సైరన్ మోగించారా?. రెండేళ్లు ఉన్నాయంటూనే ముందస్తుకు సిద్ధవుతున్నారా?. పార్టీ నేతలకు దిశానిర్దేశంతో పాటు వార్నింగ్ ఎందుకిచ్చారు?. పార్టీ నేతల్లో అసంతృప్తి లేదని జగన్ అనుకుంటున్నారా?. ప్రజలు ఆశించిన దానికంటే బాగా చేశామని నమ్ముతున్నారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-04-28T01:01:08+05:30 IST