Ap News: జగన్ ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన జనం
ABN , First Publish Date - 2022-05-16T23:34:27+05:30 IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏలూరులో సీఎం పర్యటించారు. వైఎస్సార్ రైతుభరోసా నిధులు విడుదల చేశారు. 50.10 లక్షల మందికి ..
పశ్చిమగోదావరి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Ap Cm Jagan Mohan Reddy) ఏలూరులో సీఎం పర్యటించారు. వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేశారు. 50.10 లక్షల మందికి ఏపీ ప్రభుత్వం రైతు భరోసా పంపిణీ చేసింది. దీన్ని ఖరీఫ్ సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చింది. అయితే సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే సభకు వచ్చిన ప్రజలు ఒక్కొక్కరిగా జారుకున్నారు. ఆగమని కొందరు వారించినా ఆగలేదు. జగన్ స్పీచ్కు ముందు ఎంతో శ్రద్ధగా ఉన్న మహిళలు, వృద్ధులు.. ఆ తర్వాత జగన్ ప్రసంగం కొనసాగుతుండగానే వెళ్లిపోయారు. మరోవైపు సభ ప్రాంగణానికి చివరిలో ఉన్న కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. అనుకున్నంత మంది రాకపోవడంతో ఆ పార్టీ నేతల్లో కొంత నిరుత్సాహం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. భారీగా ఖర్చు పెట్టి సభకు ఏర్పాట్లు చేసినప్పటికీ జనం మధ్యలోనే వెళ్లిపోయారు.