కేంద్రమంత్రి ధర్మాంద్ర ప్రధాన్ను కలిసిన AP CM
ABN , First Publish Date - 2022-01-04T18:02:01+05:30 IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను సీఎం జగన్, వైసీపీ ఎంపీలు కలుసుకున్నారు. ఏపీలో నవోదయా పాఠశాలల ఏర్పాటు, కేంద్ర విద్యా సంస్థలకు బడ్జెట్లో నిధులు, నూతన విద్యావిధానం అమలుపై కేంద్రమంత్రితో జగన్ చర్చించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన ఏడు మెగా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రమంత్రికి సీఎం జగన్, వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేయనున్నారు.