నేడు రైతుల మహా పాదయాత్రకు విరామం
ABN , First Publish Date - 2021-11-18T13:26:40+05:30 IST
రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ఈరోజు విరామం ఇచ్చారు.
అమరావతి: రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ఈరోజు విరామం ఇచ్చారు. జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం జిల్లా గుడ్లూరులోనే రైతులు బస చేశారు. గత రాత్రి కూడా సరైన వసతి లేకపోవడంతో అమరావతి రైతులు ఇబ్బందులు పడ్డారు. రేపు యధావిధిగా పాదయాత్ర ఉంటుందని పరిరక్షణ సమితి నేత గద్దె తిరుపతి రావు ప్రకటించారు.