స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల డ్రామా

ABN , First Publish Date - 2021-05-15T09:40:59+05:30 IST

పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల డ్రామాలు ఆడుతున్నారాని అమరావతి రైతులు మండిపడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని..

స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల డ్రామా

514వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు  

తుళ్ళూరు, మే 14: పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల డ్రామాలు ఆడుతున్నారాని అమరావతి రైతులు మండిపడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఉద్యమం శుక్రవారానికి 514వ రోజుకు చేరుకుంది. ఇంటింటి అమరావతి కార్యక్రమంలో భాగంగా రాజధాని గ్రామాలలో రైతులు ఇళ్ల నుంచే జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అవకాశం ఉన్న గ్రామాలలో  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రైతు ధర్నా శిబిరాల నుంచి ఆందోళలను కొనసాగాయి. మాకు అండగా ఉండే ఎవరినైనా ఆదరిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు రైతులు, మహిళలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అమరావతి రైతులు పక్షాన పోరాటం చేస్తున్నారన్నారు. వైసీపీ తప్ప అన్నీ పార్టీలు  రైతులకు అండగా ఉన్నాయన్నారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. ముస్లిం సోదరులకు రైతులు రంజాన్‌ శుభాకాంక్షలు  చెప్పారు. ఈ సందర్భంగా నెక్కల్లులో మొక్కలు నాటి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

Updated Date - 2021-05-15T09:40:59+05:30 IST