అవినీతి, ఫిరాయింపులు ఉండవు..ఆప్ అభ్యర్థుల అఫిడవిట్

ABN , First Publish Date - 2022-02-02T21:10:28+05:30 IST

ఈసారి గోవా ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల చేత ప్రతినలు చేయిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం..

అవినీతి, ఫిరాయింపులు ఉండవు..ఆప్ అభ్యర్థుల అఫిడవిట్

పనజి: ఈసారి గోవా ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల చేత ప్రతినలు చేయిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఆదే బాట పట్టింది. తాజాగా ఆప్ నుంచి పోటీ చేస్తున్న 40 మంది అభ్యర్థులు ఇందుకు సంబంధించిన అఫిడవిట్‌పై సంతకాలు చేశారు. తాము అవినీతి, ఫిరాయింపులకు పాల్పడేది లేదంటూ అఫిడవిట్‌పై అభ్యర్థులంతా సంతకాలు చేశారు. అభ్యర్థులు తమ అఫిడవిట్లతో పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి మీడియా సమావేశంలో బుధవారంనాడు పాల్గొన్నారు.


''గోవా రాజకీల్లో ఫిరాయింపులనేది అతి పెద్ద సమస్య. ప్రజలు మాకు ఓటు వేయక ముందే మేము ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నాం'' అని కేజ్రీవాల్ తెలిపారు. ఈ లీగల్ అఫిడవిట్లు గోవాలో ప్రజలకు అందుబాటులో ఉంటాయని, ఎమ్మెల్యేలు విశ్వాస రాహిత్యానికి పాల్పడితే ఓటర్లు కేసు వేయవచ్చని అన్నారు. దీనికి ముందు కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థులందరితో కలిసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడమంటూ ప్రతిని చేయించింది. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 14న జరుగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-02-02T21:10:28+05:30 IST