ఏపీ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2020-10-25T14:21:02+05:30 IST

నగరంలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని విజయదశమి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం ఇక్కడ పర్యటించిన కిషన్ రెడ్డి.. తొలుత ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయన..

ఏపీ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

విజయవాడ: నగరంలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని విజయదశమి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం ఇక్కడ పర్యటించిన కిషన్ రెడ్డి.. తొలుత ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయన.. సంప్రదాయ పూజా కార్యక్రమాలు అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, మధుకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T14:21:02+05:30 IST