కన్నా లక్ష్మీనారాయణ కోడలి మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి
ABN , First Publish Date - 2020-05-29T17:43:44+05:30 IST
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గోపాలకృష్ణ బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోస్ట్మార్టం నివేదిక వస్తుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గురువారం ఆమె మాదాపూర్లో అనుమానాస్పదస్థతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే.