నియామకాల్లో అక్రమాలపై విచారణ జరపాలి

ABN , First Publish Date - 2021-05-11T05:41:25+05:30 IST

వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పశు సంవర్థకశాఖలో ఇటీవల జరిగిన పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్‌

నియామకాల్లో అక్రమాలపై విచారణ జరపాలి

గుంటూరు, మే 10: వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పశు సంవర్థకశాఖలో ఇటీవల జరిగిన పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు  డిమాండ్‌ చేశారు. పశు సంవర్థకశాఖలో 147 ల్యాబ్‌ టెక్నీషియన్లు, మరో 147 ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులను భర్తీ చేసిందన్నారు. అయితే వెటర్నరీ యూనివర్సిటీ రిజిష్ట్రార్‌ మాధవరావు రాత పరీక్ష నిర్వహించకుండా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు అనుబంధంగా మరొక జీవో తెప్పించుకొని కేవలం తన ఇష్టానుసారంగా నిమామకాలు చేసేందుకు అనుమతులు తీసుకున్నారని ఆరోపించారు. తనకు కావాల్సిన వారిని అడ్డదారిలో ఎంపిక చేసి, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించకుండా అడ్డగోలు నియామకాలు చేసి వివిధ జిల్లాలో జాయింట్‌ డైరెక్టర్లకు సెలెక్ట్‌ లిస్ట్‌ పంపించారన్నారు. అక్రమంగా జరిగిన నియామకాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.  

 

Updated Date - 2021-05-11T05:41:25+05:30 IST