సీఎం జగన్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే..: టీడీపీ నేత

ABN , First Publish Date - 2021-03-05T17:21:02+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో బంద్ కొనసాగుతోంది.

సీఎం జగన్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే..: టీడీపీ నేత

రాజమండ్రి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో బంద్ కొనసాగుతోంది. రాజమండ్రిలో బంద్ ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయి. కోటగుమ్మం సెంటర్ వద్ద టీడీపీతోపాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అన్ని రాజకీయపార్టీలు ముందుకొచ్చాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే.. కేంద్రంతో మాట్లాడి నిరసన తెలియజేయాలన్నారు.  లేదా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ముందుకువస్తారని, వైసీపీ నేతలు కూడా ముందుకు రావాలన్నారు. స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణ కోసం జగన్ నాయకత్వం వహిస్తే.. తమ నాయకుడు చంద్రబాబు కూడా ముందుకు వస్తామని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2021-03-05T17:21:02+05:30 IST