AP: అసెంబ్లీ ముట్టడికి టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తల యత్నం

ABN , First Publish Date - 2021-11-18T15:16:54+05:30 IST

అసెంబ్లీ ముట్టడికి పలువురు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు యత్నించారు. అసెంబ్లీ ప్రధాన మార్గం వరకు వచ్చి నినాదాలు చేశారు.

AP: అసెంబ్లీ ముట్టడికి టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తల యత్నం

అమరావతి: అసెంబ్లీ ముట్టడికి పలువురు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు యత్నించారు. అసెంబ్లీ ప్రధాన మార్గం వరకు వచ్చి నినాదాలు చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంటే నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా అని మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రభుత్వ జీవోలు 42 ,50,51 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-11-18T15:16:54+05:30 IST