ఏడవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-26T14:51:35+05:30 IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

ఏడవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు ప్రారంభమయ్యాయి.  నేడు 2020 మార్చ్31 నాటికి ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక నివేదికను (కాగ్ నివేదికను) ఉభయసభల్లో  ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యా వ్యవస్థపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. మండలిలో మధ్యాహ్నం 12:30 కు డిప్యూటీ చైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నారు. మండలిలో రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలపై స్వల్పకాలిక చర్చతో పాటు,   రాష్ట్రంలో రోడ్లు, ఇతర రవాణా సదుపాయాలపై చర్చ జరుగనుంది. 


Updated Date - 2021-11-26T14:51:35+05:30 IST