ఏపీ అసెంబ్లీలో రెండో రోజు టీడీపీ నిరసనలు

ABN , First Publish Date - 2022-03-15T14:46:38+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. సభలో రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు.

ఏపీ అసెంబ్లీలో రెండో రోజు టీడీపీ నిరసనలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. సభలో రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ జరపాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ చేపట్టాలంటూ తెలుగు దేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ సభ్యులు ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2022-03-15T14:46:38+05:30 IST