ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...వాయిదా
ABN , First Publish Date - 2022-03-14T14:57:19+05:30 IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కాగా టీడీపీ సభ్యుల ఆందోళనలతో శాసనసభ మొదలైన కాసేపటికే వాయిదా పడింది.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కాగా టీడీపీ సభ్యుల ఆందోళనలతో శాసనసభ మొదలైన కాసేపటికే వాయిదా పడింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ ఆందోళనకు దిగింది. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. సీఎం రాజీనామా చేయాలంటూ పోడియం వద్ద తెలుగు దేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా టీడీపీ వైఖరిని వైసీపీ తప్పుపడుతోంది. చర్చ జరపకుండా ప్రతిరోజు టీడీపీ సభకు అడ్డుపడుతోందంటూ మంత్రి బుగ్గన విమర్శలు గుప్పించారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభ ఐదు నిమిషాలు వాయిదా పడింది.