2023లో AP Assembly ఎన్నికలు వస్తాయి: రఘురామ
ABN , First Publish Date - 2022-06-09T21:41:20+05:30 IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly) వస్తాయని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Rama Krishna Raju) జోస్యం చెప్పారు. గురువారం
ఢిల్లీ: 2023లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly) వస్తాయని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Rama Krishna Raju) జోస్యం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్వేలో ప్రతిపక్షానికి 115, పాలక పక్షానికి మిగతా సీట్లు వస్తాయని తేలిందని వెల్లడించారు. ఏడుగురు ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లలేదని సీఎం జగన్ అన్నారని, ఏడుగురు కాదు 8 మంది ఎమ్మెల్యేతో పాటు జగన్ కూడా గడపగడపకు వెళ్లలేదని తెలిపారు. అమ్మఒడి ఎత్తేస్తే ఎలా అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో 93 శాతం మంది విద్యార్థులు టెన్త్ పాస్ అయ్యారని, తమ ప్రభుత్వంలో టీచర్లపై మానసిక ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. మాజీమంత్రి వివేకా కేసులో సీబీఐ విచారణ లేటైతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయన్నారు. కోనసీమ ఘటనపై హోంమంత్రికి లేఖ రాస్తానని రఘురామకృష్ణరాజు ప్రకటించారు.