దిశ యాప్పై ప్రశ్నలడిగిన వైసీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
ABN , First Publish Date - 2021-11-22T16:10:48+05:30 IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం మూడవ రోజు ప్రారంభం కాగానే...
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం మూడవ రోజు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా వైసీపీ శాసన సభ్యురాలు భాగ్యలక్ష్మి దిశ యాప్పై ప్రశ్నలు అడిగారు. దీనికి సమాధానంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ యాప్ ద్వారా ప్రభుత్వ చర్యలతో మహిళలకు రక్షణ దొరుకుతుందన్నారు. దిశ యాప్పై వివిధ సందర్భాల్లో ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని భాగ్యలక్ష్మి అన్నారు. మహిళా మంత్రులు, వైసీపీ మహిళా శాసన సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.