సెప్టెంబర్ మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

ABN , First Publish Date - 2021-08-21T03:41:20+05:30 IST

అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది.

సెప్టెంబర్ మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. వర్షాకాల సమావేశాలను సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అందింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈడీ కోర్టు విచారణ ప్రారంభిస్తున్న తరుణంలో ఎపీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం పొలిటికల్ హీట్‌ను పెంచింది. కరోనా కారణంగా బడ్జెట్ సమావేశాలు మూడు రోజులకే పరిమితం కావడంతో ఇప్పుడు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని నిర్ణయించారు.

Updated Date - 2021-08-21T03:41:20+05:30 IST