అసెంబ్లీ ముందుకు 3 రాజధానుల ఉపసంహరణ బిల్లు

ABN , First Publish Date - 2021-11-22T20:04:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును

అసెంబ్లీ ముందుకు 3 రాజధానుల ఉపసంహరణ బిల్లు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీంతో పాటు.. సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వం ఏ బిల్లులను అయితే వెనక్కి తీసుకుందో వాటిపైన ప్రస్తుతం అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. ఈ బిల్లులపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారం అనుమతించారు. బుగ్గన మాట్లాడిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్నారు. అయితే.. జగన్ ఏం చెబుతారా..? అని తెలుగు ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2021-11-22T20:04:21+05:30 IST