అసెంబ్లీ ముందుకు 3 రాజధానుల ఉపసంహరణ బిల్లు
ABN , First Publish Date - 2021-11-22T20:04:21+05:30 IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీంతో పాటు.. సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వం ఏ బిల్లులను అయితే వెనక్కి తీసుకుందో వాటిపైన ప్రస్తుతం అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. ఈ బిల్లులపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారం అనుమతించారు. బుగ్గన మాట్లాడిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్నారు. అయితే.. జగన్ ఏం చెబుతారా..? అని తెలుగు ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.