ఏపీ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ జేఏసీ ఆవిర్భావం

ABN , First Publish Date - 2021-03-08T05:43:26+05:30 IST

రాష్ట్రంలోని న్యాయవాద సంఘాలు కలసి ఉమ్మడిగా వారి సమస్యలు పరిష్కారం కోసం ఏపీ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ జేఏసీ పేరిట నూతన సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ఏపీ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ జేఏసీ ఆవిర్భావం
ఐక్యతను చాటుతున్న ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ జేఏసి సభ్యులు

గుంటూరు(తూర్పు), మార్చి7: రాష్ట్రంలోని న్యాయవాద సంఘాలు కలసి ఉమ్మడిగా వారి సమస్యలు పరిష్కారం కోసం ఏపీ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ జేఏసీ పేరిట నూతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం బ్రాడీపేటలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో జేఏసీ నూతనకార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ చైర్మన్‌గా యెన్నపూస భాగ్యలక్ష్మీరెడ్డి(అనంతపురం), కన్వీనర్‌గా పల్లపుకృష్ణ(గుంటూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ ఉపాధ్యక్షులుగా  కె. సత్యనారాయణ, ఐ.శివప్రసాదు, స్వామి ఎన్నికయ్యారు. వీరితో పాటు కోకన్వీనర్లను, గౌరవ సలహాదారులను ఎన్నుకున్నారు. 


Updated Date - 2021-03-08T05:43:26+05:30 IST