ఆరోగ్యశ్రీ పథకం.. ఆ ఆరు జిల్లాలకు విస్తరణ

ABN , First Publish Date - 2020-07-14T02:21:35+05:30 IST

వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ పథకం వర్తింపును రాష్ట్రంలోని మరో ఆరు జిల్లాలకు విస్తరింపజేశారు. ఇక నుండి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం

ఆరోగ్యశ్రీ పథకం.. ఆ ఆరు జిల్లాలకు విస్తరణ

అమరావతి: వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ పథకం వర్తింపును రాష్ట్రంలోని మరో ఆరు జిల్లాలకు విస్తరింపజేశారు. ఇక నుండి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఈ పథకం వర్తించనుంది. గురువారం నుంచి ఈ ఆరు జిల్లాల్లో సేవలను అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. తాజా ఆదేశాలతో మొత్తంగా 2200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది. గతంలో 1059 వైద్య ప్రక్రియలకే ఈ పథకం వర్తించేది. అదికూడా అరకొర సేవలకే పరిమితం అయ్యింది. అంతేకాకుండా ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు భారీగా బకాయిలు ఉన్నాయి. 

Updated Date - 2020-07-14T02:21:35+05:30 IST