బెట్టింగ్.. గుట్టు రట్టు
ABN , First Publish Date - 2020-10-19T10:50:20+05:30 IST
బెట్టింగ్.. గుట్టు రట్టు
14 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు
నరసాపురం, అక్టోబరు 18: క్రికెట్ బెట్టింగ్కు పాల్పపడుతున్న 14 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.75,500 నగదు, 14 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పాలకొల్లు సీఐ ఆంజనే యులు (ఇన్ఛార్జ్) చెప్పారు. ఆదివారం రాత్రి నరసాపురం సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘భీమవ రానికి చెందిన పాండు ప్రధాన బుకీగా, మొగల్తూరుకు చెందిన తమ్మూ వీరవెంకట మురళీకృష్ణ సబ్ బుకీగా బెట్టింగ్ జరుపు తున్నట్లు సమాచారం అందింది. దీనిపై నిఘా ఉంచాం. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కొందరు ముందుగా మురళీకృష్ణకు బెట్టింగ్ నిమిత్తం నగదు ఇవ్వగా మరి కొందరు డిజిటల్ విధానం ద్వారా కొంత సొమ్ము జమ చేశారు. మ్యాచ్ ప్రారంభమైన దగ్గర నుంచి వీరు పందేలు కాస్తూ వస్తున్నారు.పక్కా సమాచారంతో మురళీ కృష్ణను, బెట్టింగ్ కాసిన 14 మందిని అరెస్టు చేశాం. భీమవరానికి చెందిన ప్రధాన బుకీ పాండు పరారయ్యాడు. బెట్టింగ్లు కాసిన మరో నలుగురు తప్పించుకున్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీస్ టీమ్లను ఏర్పాటు చేశాం’ అని సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్సైలు మల్లికార్జునరెడ్డి, ప్రియ కుమార్లు పాల్గొన్నారు.