స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ
ABN , First Publish Date - 2020-10-18T09:01:53+05:30 IST
స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ
విజయవాడ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కనకదుర్గమ్మ కొలువుదీరిన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిదిరోజులపాటు జరిగే ఉత్సవాల్లో దుర్గమ్మ రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు శనివారం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారు జామున 3 గంటల నుంచి అమ్మవారికి సుప్రభాతసేవ, స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనాధికాలను పూర్తిచేసిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు.