పురుగుల మందుతాగి భార్య ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-21T11:52:06+05:30 IST

పురుగుల మందుతాగి భార్య ఆత్మహత్య

పురుగుల మందుతాగి భార్య ఆత్మహత్య

పలమనేరు రూరల్‌, సెప్టెంబరు 20 : భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని ఎర్రగుండ్లేపల్లెలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎర్రగుండ్లేపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం, చంద్రకళ దంపతులు. వీరు వ్యవసాయం చేసుకొని జీవనం సాగించేవారు. అయితే సుబ్రమణ్యానికి అదేగ్రామానికి చెందిన వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని చంద్రకళ భర్తను ప్రశ్నించింది. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగింది.  కుటుంబ సభ్యులు వెంటనే పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి వెంకట్రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలమనేరు ఎస్‌ఐ ప్రియాంక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T11:52:06+05:30 IST