పాముకాటుతో బాలిక మృతి

ABN , First Publish Date - 2020-09-21T10:47:15+05:30 IST

పాముకాటుతో బాలిక మృతి

పాముకాటుతో బాలిక మృతి

చాగలమర్రి, సెప్టెంబరు 20: మండలంలోని చక్రవర్తులపల్లె గ్రామానికి చెందిన పల్లవి(9) అనే బాలిక పాముకాటుతో శనివారం రాత్రి మృతి చెందింది. పల్లవి ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో వర్షపు నీటిని చీపురుతో శుభ్రం చేస్తుండగా చీపురులో ఉన్నపాము కాటు వేయడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆటోలో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పల్లవి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్నపీరయ్య తెలిపారు. 

 

‘బాలిక మృతి బాధాకరం’ 

చాగలమర్రి మండలంలోని చక్రవర్తులపల్లె గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కరిమద్దెల బాబుల్‌రెడ్డి కుమార్తె పాము కాటుతో మృతి చెందడం ఎంతో బాధాకరమని ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాతరెడ్డి అన్నారు. ఆదివారం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో మృతి చెందిన బాలిక మృతదేహంపై పూలమాల వేసి సంతాపం ప్రకటించారు. ఆయన వెంట టీడీపీ కన్వీనర్‌, న్యాయవాది నరసింహారెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-09-21T10:47:15+05:30 IST