పాతపట్నంలో 19 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-09-21T10:32:16+05:30 IST

పాతపట్నంలో 19 మందికి పాజిటివ్‌

పాతపట్నంలో 19 మందికి పాజిటివ్‌

పాతపట్నం, సెప్టెంబరు 20: మండలంలో గడిచిన 24 గంటల్లో 19 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఇన్‌చార్జి తహసీల్దార్‌ బి.నాగభూషణరావు తెలిపారు. అలాగే మండల వ్యాప్తంగా 24 మంది జ్వర పీడితులను గుర్తించి వైద్య సేవలు అందించే చర్యలు తీసుకున్నామన్నారు. కాగా మండలం నుంచి 12 మందిని ఉన్న వైద్యం నిమిత్తం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించినట్లు చెప్పారు. ఫ నందిగాం: మండలంలోని రెండు గ్రామాలకు చెందిన ఐదుగురికి ఆదివారం కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించినట్లు తహసీల్దార్‌ ఎన్‌.రాజారావు తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో వారికి వ్యాధి నిర్ధారణ కావడంతో సంతబొమ్మాళి క్వారంటైన్‌కు తరలించామన్నారు. ఆయా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ఫ హరిపురం: మందస మండలంలో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ అప్పలస్వామి తెలిపారు. జ్వరాలతో ఎవరు బాధపడినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా డలసరి జలపాతం సందర్శనకు అనుమతులు రద్దుచేసినట్లు అధికారులు ప్రకటించారు.

Updated Date - 2020-09-21T10:32:16+05:30 IST