మహిళల ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’
ABN , First Publish Date - 2020-09-21T10:32:36+05:30 IST
మహిళల ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’
హిరమండలం, సెప్టెంబరు 21: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వైఎస్ఆర్ ఆసరా దోహదపడుతుందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బ్యారేజి సెంటర్లో ఈ పథకం లబ్ధిదారు ఏర్పాటు చేసిన కిరాణా దుకాణాన్ని ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
జీవనోపాధి పెంచుకోండి
వజ్రపుకొత్తూరు: వైఎస్ఆర్ ఆసరా సొమ్ముతో మహిళలు జీవనోపాధి పెంచుకోవాలని మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి కోరారు. ఆదివారం రాత్రి పల్లిసారధిలో ఆసరా ముగింపు వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం జి.ప్రసాదరావు, వైసీపీ నాయకులు యు.ఉద యకుమార్, ఏఎంసీ చైర్మన్ పీవీ సతీష్, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు యు.నీలవేణి, పి.ధర్మారావు పాల్గొన్నారు.