అన్నమయ్య ప్రాజెక్టు గేట్లెత్తారు

ABN , First Publish Date - 2020-09-21T10:22:51+05:30 IST

అన్నమయ్య ప్రాజెక్టు గేట్లెత్తారు

అన్నమయ్య ప్రాజెక్టు గేట్లెత్తారు

రాజంపేట, సెప్టెంబరు 20 : రాజంపేట మండలం అన్నమయ్య ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు, దిగువ ప్రాంతాలకు ఆదివారం సాయంత్రం నీటిని వదిలారు. అన్నమయ్య ప్రాజెక్టు ఎస్‌ఈ రాముడు, ఈఈ ఎన్‌.రవికిరణ్‌ నీటిని విడుదల చేశారు. శనివారం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు 150 క్యూసెక్కుల నీటిని, ఆదివారం సాయంత్రం రెండు గేట్ల ద్వారా చెయ్యేరు నది దిగువ ప్రాంతాలకు 2350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2500 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి 2350 క్యూసెక్కులు, కాలువ నుంచి 150 క్యూసెక్కులు మొత్తం 2500 క్యూసెక్కులను దిగువ ప్రాంతాలకు వదిలారు. కార్యక్రమంలో డీఈలు నరసమ్మ, ఉమామహేశ్వర్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, ఏఈలు గురుమూర్తి, నాగేంద్రనాయక్‌, వేణుగోపాల్‌, చంద్రుడు, సీతారాం పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T10:22:51+05:30 IST