267 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-09-21T10:25:41+05:30 IST

267 పాజిటివ్‌ కేసులు నమోదు

267 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 267 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 39,716కు చేరుకుంది. మరో ముగ్గురు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 414కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న 716 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 35,504 మంది కరోనా నుంచి కోలుకున్నారు. స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో 2685 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 3,57,201 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం 4195 మందికి స్వాబ్‌ టెస్టులు చేశారు. 

Updated Date - 2020-09-21T10:25:41+05:30 IST