జూలో 2 నుంచి వన్యప్రాణుల సప్తాహం

ABN , First Publish Date - 2020-09-21T10:03:08+05:30 IST

జూలో 2 నుంచి వన్యప్రాణుల సప్తాహం

జూలో 2 నుంచి వన్యప్రాణుల సప్తాహం

ఆరిలోవ, సెప్టెంబరు 20: ఇందిరగాంధీ జంతు ప్రదర్శనశాలలో అక్టోబరు రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు వణ్యప్రాణుల సప్తాహం నిర్వహిస్తున్నట్టు జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందినీ సలారై తెలిపారు. కరోనా కారణంగా విద్యార్థులకు నిర్వహించవలసిన పలు పోటీలను ఆన్‌లైన్‌ ద్వారా చేపడతామన్నారు. వైల్డ్‌ వైఫ్‌కు సంబంధించిన ఈ పోటీల్లో పాల్గొనేందుకు పాఠశాలల విద్యార్థులతో పాటు కాలేజీ స్టూడెంట్లు కూడా అర్హులని పేర్కొన్నారు. ప్రధానంగా వ్యాసరచన,  క్విజ్‌, పెయింటింగ్‌, పోస్టర్‌ మేకింగ్‌, ఎలక్యూషన్‌, ఫొటోగ్రఫీ తదితర పోటీలను నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8121318643, 9000151920, 94946 71937, 9490456103, 9440810211, 9440810213 సెల్‌ నంబర్లను సంప్రదించాలని కోరారు. విజేతలకు బహుమతులను ఆన్‌లైన్‌లో కానీ పోస్టల్‌ ద్వారా గానీ అందిస్తామని క్యూరేటర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-21T10:03:08+05:30 IST