‘సచివాలయ’ పరీక్షా కేంద్రాలకు 207 బస్సులు

ABN , First Publish Date - 2020-09-21T10:04:26+05:30 IST

‘సచివాలయ’ పరీక్షా కేంద్రాలకు 207 బస్సులు

‘సచివాలయ’ పరీక్షా కేంద్రాలకు 207 బస్సులు

ద్వారకాబస్‌స్టేషన్‌, సెప్టెంబరు 18: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆదివారం నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పీటీడీ విశాఖ రీజియన్‌కు చెందిన 207 బస్సులు రవాణా సేవలందించాయి. జిల్లాలోని పది డిపోలకు చెందిన ఈ బస్సులు ఉదయం 6:00 నుంచి రాత్రి 7:00 గంటల వరకు రవాణా సేవలందించాయి. పరీక్షా కేంద్రాలు ఉన్న ఉన్న 30 రూట్లలో ఈ ప్రత్యేక సర్వీసులు నడిపినట్టు అధికారులు వెల్లడించారు. ఎక్కువ మంది అభ్యర్థులు సొంత వాహనాలు వినియోగించుకున్నట్టు పీటీడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం 70 ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-09-21T10:04:26+05:30 IST