‘రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారం’
ABN , First Publish Date - 2020-09-21T09:37:49+05:30 IST
‘రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారం’
శింగనమల, సెప్టెంబరు 20: బీజేపీని మరింత బలోపేతం చేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపడతామని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ జిల్లా అద్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం శింగనమలలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి చిరంజీవిరెడ్డి హాజరై పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సందిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలో కుల రాజకీయం, పెత్తందారి, అవినీతి ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయన్నారు. చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్యాయంపై ఎదిరిస్తే కేసులు పెట్టడం జరుగుతోందన్నారు. నార్పలలో ఏబీవీపీ నాయకులను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అరెస్టు చేయించడం అన్యాయానికి పరాకాష్ట అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన లింగమయ్య, బాలాజీ, రవి, అశోక్తో పాటు 60 మంది బీజేపీలో చేరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ సదాశివారెడ్డి, సాకే శంకర్, నాయకులు అశోక్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, గోపాల్రావు, సూర్యప్రతా్పరెడ్డి, రాజు పాల్గొన్నారు.