బీసీలను వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-09-21T09:36:55+05:30 IST
బీసీలను వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం
గోరంట్ల, సెప్టెంబరు 20: బీసీ ఓట్లతో గద్దెనెక్కిన జగన్ ప్రభు త్వం అదే వర్గాన్ని వేధించడమే పనిగా పెట్టుకుందని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శించారు. ఆదివారం స్థానిక నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ మాజీ మంత్రులైన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలపై అక్రమ కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఈఎ్సఐ స్కాంలో 9వ ముద్దాయి కార్తీక్కు మంత్రి జయరాం కుమారుడు బెంజ్కారు ఇస్తే ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదని నిలదీశారు. సాక్ష్యాధారాలు లేకున్నా టీడీపీ నాయకులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు. స్వపక్షం వారిని వదిలేస్తూ పక్షపాతంగా వ్యవహరించడం తగదన్నారు. బీసీ, ఎస్సీ, ఓట్లతో గెలుపొంది... బీసీలను జైలులో పెడుతున్నారని, ఎస్సీలపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సమావేశంలో టీడీపీ మాజీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.