ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
ABN , First Publish Date - 2020-08-10T10:50:12+05:30 IST
స్థానిక విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట ఆదివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఉదయగిరి రూలర్, ఆగస్టు 9: స్థానిక విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట ఆదివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో విఫలమయ్యారన్నారు. కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ కార్మిక, కర్షకులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు జీ.నాగేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, విజయరామిరెడ్డి, సుదర్శన్, రమణయ్య, గోపి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.