మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-09T06:24:50+05:30 IST

సమ స్యలు పరిష్కరించాలని మూడు రోజులుగా నిర వధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో మధ్యాహ్నభోజన కార్మికులు బుధ వారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.

మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన
ఆందోళన చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

సిరిసిల్ల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సమ స్యలు పరిష్కరించాలని మూడు రోజులుగా నిర వధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో మధ్యాహ్నభోజన కార్మికులు బుధ వారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్య ంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి కార్మి కులు తరలివచ్చారు. కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మూడు నెలలుగా పెం డింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు, వేతనాలను  చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనాలను అమలు చేయాలని, ప్రభు త్వమే గ్యాస్‌ సిలిండర్లు, కోడిగుడ్లు సరఫరా చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వంట చార్జీలు పెంచాలని, కిరా ణా సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయా లని అన్నారు. సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోకపోవడంతో ఆందోళన చేపట్టామన్నారు.  

Updated Date - 2021-12-09T06:24:50+05:30 IST