పరిహారం కోసం ఆందోళన
ABN , First Publish Date - 2022-01-19T04:29:32+05:30 IST
పాలమూరు-రంగారెడ్డి మొదటి ప్యాకేజీ పనులను మంగళవారం భూనిర్వాసితులు అడ్డగించారు.
- పీఆర్ఎల్ఐ పనులను అడ్డుకున్న నిర్వాసితులు
కొల్లాపూర్ రూరల్, జనవరి 18 : పాలమూరు-రంగారెడ్డి మొదటి ప్యాకేజీ పనులను మంగళవారం భూనిర్వాసితులు అడ్డగించారు. మండలంలోని ఎల్లూరు గ్రామ శివారులో పీఆర్ ఎల్ఐలో నిర్వాసితులుగా మారుతున్న 37ఎకరాల రైతులు పరిహారం కోసం ఆందోళన చేపట్టారు. తమ భూమిలో పరి హారం ఇవ్వకుండానే దౌర్జన్యంగా పనులను చేపట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు భీష్మించి కూర్చొన్నారు. నిర్వాసిత రైతు లు సంఘటనా స్థలంలో టెంట్ వేసి వంటవార్పు కూడా చేప ట్టారు. నేడు తమ కుటుంబ సభ్యులతో పనులను అడ్డగిస్తా మని వారు పేర్కొన్నారు.