మున్సిపల్ సమ్మెపై ‘లాఠీ’
ABN , First Publish Date - 2021-06-15T08:53:15+05:30 IST
సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది
ఆంధ్రజ్యోతి, అనంతపురం :
సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేస్తున్న కార్మిక నేతలను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో ఇద్దరు మహిళా కార్మికులు స్పృహ తప్పారు. మరో కార్మికురాలి కాలికి గాయమైంది. 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని పోలీ్సస్టేషన్ ఎదుట సీఐటీయూ నాయకులు ఆందోళన చేశారు.