లాక్‌డౌన్‌ ఎన్నో నేర్పుతోంది!

ABN , First Publish Date - 2020-04-02T10:00:34+05:30 IST

కొవిడ్‌-19 విజృంభణతో క్రీడలు, సినిమా, ఇలా.. ఒకటేమిటి అన్ని రంగాలు స్తంభించిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సామాన్యులతో పాటు

లాక్‌డౌన్‌ ఎన్నో నేర్పుతోంది!

అనుష్క

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 విజృంభణతో క్రీడలు, సినిమా, ఇలా.. ఒకటేమిటి అన్ని రంగాలు స్తంభించిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సామాన్యులతో పాటు సెలెబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అతని భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ స్వీయ నిర్బంధంలో ఉంటూ ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా విరాట్‌తో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం పోస్ట్‌ చేసిన అనుష్క.. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎన్నో సానుకూల విషయాలను నేర్చుకుంటున్నట్టు రాసుకొచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ ఇంటివద్దే జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Updated Date - 2020-04-02T10:00:34+05:30 IST