నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి
ABN , First Publish Date - 2021-02-26T08:32:50+05:30 IST
తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని అనూష తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. నరసరావుపేటలో బుధవారం హత్యకు గురైన అనూష మృతదేహాన్ని గురువారం గోళ్లపాడులోని...
- అనూష కుటుంబ సభ్యుల డిమాండ్
ముప్పాళ్ళ, ఫిబ్రవరి 25: తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని అనూష తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. నరసరావుపేటలో బుధవారం హత్యకు గురైన అనూష మృతదేహాన్ని గురువారం గోళ్లపాడులోని ఇంటికి తీసుకువచ్చారు. అనూష మృతదేహాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ సందర్శించి నివాళులర్పించారు. అనూష కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని గ్రామస్థులు ఆమెను డిమాండ్ చేశారు. పద్మ మాట్లాడుతూ నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.