Modi manki baath: 30 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెట్టింది

ABN , First Publish Date - 2021-07-20T21:10:25+05:30 IST

ప్రధాని మోదీ ప్రతి నెలా నిర్వహించే ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం విదితమే. కేవలం ప్రసిద్ధి పొందడమే కాదు

Modi manki baath: 30 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెట్టింది

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ప్రతి నెలా నిర్వహించే ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం విదితమే. కేవలం ప్రసిద్ధి పొందడమే కాదు సుమా, ఏకంగా కొన్ని కోట్ల ఆదాయాన్ని కూడా  ప్రభుత్వాన్ని తెచ్చి పెట్టిన కార్యక్రమం ఇది. నిజమే.. ఈ కార్యక్రమం ద్వారా కేంద్రానికి 30.80 కోట్ల రూపాయలు వచ్చాయని కేంద్రం మంగళవారం రాజ్యసభ వేదికగా ప్రకటించింది. 2014 నుంచి ఇప్పటి వరకూ 30.80 కోట్ల రూపాయలు వచ్చాయని కేంద్ర ప్రసారశాఖ ప్రకటించింది. అయితే 2017-18 సంవత్సర కాలంలో అత్యధికంగా 10.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ఇక 2014-15 లో 1.16 కోట్లు, 215-16 లో 2.81 కోట్లు తెచ్చిపెట్టిందని, 2016-17 లో 5.14 కోట్లు, 2018-19 లో 7.47, 2019-20 లో 2.56 కోట్లు వచ్చాయి. ఇక 2020-21 లో 1.02 కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.   

Updated Date - 2021-07-20T21:10:25+05:30 IST