సజ్జల వ్యాఖ్యలపై పంచుమర్తి అనురాధ స్పందన

ABN , First Publish Date - 2020-02-21T20:56:15+05:30 IST

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై..

సజ్జల వ్యాఖ్యలపై పంచుమర్తి అనురాధ స్పందన

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ  స్పందించారు. సజ్జల.. దొంగలెక్కల వీసారెడ్డి స్కూల్‌లో..శిక్షణ పొందినట్లు ఉన్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వెలిగొండ తొలి సొరంగం 18.84 కిలోమీటర్లలో 17 కి.మీ. చంద్రబాబే పూర్తి చేశారన్నారు. మిగతా 1.84 కి.మీ పూర్తి చేయ‌కుండానే త‌ప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు క‌మీష‌న్ల మీదున్న శ్రద్ధ ప్రాజెక్టుల‌పై లేద‌ని తేలిందని విమర్శించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధికి.. వైసీపీ రంగులేయడం.. పేర్లు మార్చడమే తెలిసిన సీఎం జగన్‌తో..ఈ సొరంగానికి కూడా రంగులేసి డప్పు కొట్టుకోండంటూ  అనురాధ అన్నారు.

Updated Date - 2020-02-21T20:56:15+05:30 IST