మే 18 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-04-17T05:44:19+05:30 IST
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు మేనెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఏసీఈ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు.
పెదకాకాని, ఏప్రిల్ 16: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు మేనెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఏసీఈ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్నల్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26వ తేదీ నుంచి మొదలవుతాయన్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 28 ఆఖరు తేదీగా నిర్ణయించామని రూ.50 ఆలస్య రుసుముతో ఈనెల 28వ తేదీ వరకు రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్ష ఫీజు తదితర వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని తెలిపారు.