వైభవంగా ఆంథోల్ మైసమ్మ బోనాల ఉత్సవం
ABN , First Publish Date - 2021-07-26T07:13:44+05:30 IST
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం లోని ఆంథోల్ మైసమ్మ దేవాలయ 16వ బోనాల ఉత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.
చౌటుప్పల్ రూరల్, జూలై 25: చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం లోని ఆంథోల్ మైసమ్మ దేవాలయ 16వ బోనాల ఉత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. వందలాదిమంది మహిళలు బోనాలతో ఊరేగింపుగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకు న్నారు. డప్పుచప్పుళ్లు, మేళతాళాలు, పోతురాజుల విన్యాసాలు భక్తులను అలరించాయి ఆలయంలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం సమయంలో ఆంథోల్ మైసమ్మ, ఉప్పలమ్మ, ఎల్లమ్మ దేవతల ఉత్సవవిగ్రహాలకు రథోత్సవనం నిర్వహించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ వెన్రెడ్డి రాజు, భువనగిరి డివిజన్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ బి.సుమతి, రెవెన్యూ ఎండోమెంట్ పాలనా విభాగం తహసీల్దార్ బి.సునిత, కార్యనిర్వహణా ధికారి చిట్టెడి వెంకట్ రెడ్డి, రవీందర్రెడ్డి, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ చిట్టం పల్లి శ్రీనివాస్, ఉపసర్పంచ్ మల్కాజిగిరి కృష్ణ, భీమిడి ఇందిరామోహన్ రెడ్డి, ఉషారాణి, అన్నదాత విజయ్కుమార్, ప్రదీప్కుమార్ పాల్గొన్నారు.