అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు 25 వరకు రద్దు

ABN , First Publish Date - 2020-09-22T07:52:44+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు 25 వరకు రద్దు

అంతర్వేది, సెప్టెంబరు 21: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ వరకు దర్శనా లను నిలుపుదల చేసినట్టు సహాయ కమిషనరు వై.భద్రాజీ తెలిపారు. నీలకంఠేశ్వరస్వామి, గుర్రాలక్కమ్మ ఆలయాల్లో దర్శనాలు రద్దు చేశామని చెప్పారు.  మరోవైపు అంతర్వేది ఆలయంలో ఇటీవల రథం దగ్ధం కారణంగా 144, 30 సెక్షన్లు అమలులో ఉన్న కారణంగా ఆలయ ప్రాంగణమంతా పోలీసులు మోహరించి ఉన్నారు. కరోనా ఉధృతి కారణంగా దర్శనాలను రద్దు చేసిన ఆలయ అధికారులు 21వ తేదీ నుంచి దర్శనాలు ఉంటా యని చెప్పడంతో సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అయితే దర్శనం లేకపోయే సరికి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రానికి రావడానికి భయపడాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-09-22T07:52:44+05:30 IST