అన్షు, సోనమ్కు ఒలింపిక్ బెర్త్
ABN , First Publish Date - 2021-04-11T09:10:15+05:30 IST
భారత యువ రెజ్లర్లు అన్షు మాలిక్ (19), సోనమ్ మాలిక్ (18) అదరగొట్టారు. ఇక్కడ జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అద్భుత ప్రతిభ చూపి టోక్యో బెర్త్ దక్కించుకున్నారు...
- సాక్షి ఆశలు గల్లంతు
ఆల్మటి (కజకిస్థాన్): భారత యువ రెజ్లర్లు అన్షు మాలిక్ (19), సోనమ్ మాలిక్ (18) అదరగొట్టారు. ఇక్కడ జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అద్భుత ప్రతిభ చూపి టోక్యో బెర్త్ దక్కించుకున్నారు. దాంతో టోక్యో విశ్వక్రీడల్లో మహిళల రెజ్లింగ్లో భారత్ తరఫున ముగ్గురు తలపడనున్నారు. వినేశ్ ఫొగట్ (53కి.) ఇప్పటికే ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. మహిళల 62 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన సోనమ్.. గాయంతో ఈ రౌండ్నుంచి వైదొలగి రజత పతకంతో సరిపెట్టుకుంది. అయితే అంతకుముందు సెమీ్స చేరడంతోనే ఒలింపిక్స్కు క్వాలిఫై అయింది. దాంతో రియో క్రీడల కాంస్య పతక విజేత సాక్షి మాలిక్కు టోక్యో దారులు మూసుకుపోయాయి. 57 కిలోల విభాగం నుంచి అన్షు టోక్యో టికెట్ దక్కిం చుకుంది. ఫైనల్ చేరిన అన్షు తుదిబౌట్లో ఓటమిపాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇక 68 కిలోల విభాగం సెమీ్సలో ఓడడంతో నిషాకు ఒలింపిక్ బెర్త్ చేజారింది.