గోపీనాథ్‌జెట్టికి సీవీఎస్వోగా మరో ఏడాది పొడిగింపు

ABN , First Publish Date - 2021-04-21T06:39:30+05:30 IST

టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌(సీవీఎస్వో)గా పనిచేస్తున్న గోపీనాథ్‌జెట్టికి డిప్యుటేషన్‌ను మరో ఏడాది పొడిగిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గోపీనాథ్‌జెట్టికి సీవీఎస్వోగా మరో ఏడాది పొడిగింపు

తిరుమల, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌(సీవీఎస్వో)గా పనిచేస్తున్న గోపీనాథ్‌జెట్టికి డిప్యుటేషన్‌ను మరో ఏడాది పొడిగిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31వ తేదీనాటికి ఆయన డిప్యుటేషన్‌ ముగిసింది. ఆయన్నే మరోఏడాది కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో 2022 మార్చి 31వ తేదీ వరకు గోపీనాథ్‌జెట్టి సీవీఎస్వోగా కొనసాగుతారు. 

Updated Date - 2021-04-21T06:39:30+05:30 IST