మరో తిరుపతి కానున్న యాదాద్రి
ABN , First Publish Date - 2022-01-25T07:42:18+05:30 IST
యాదాద్రి క్షేత్రం దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా
యాదాద్రి: యాదాద్రి క్షేత్రం దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం యాదాద్రి జిల్లా శారాజీపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదాద్రి క్షేత్రం రానున్న రోజుల్లో మరో తిరుపతిగా మారనుందని ఆకాంక్షించారు. హైదరాబాద్కు చేరువలో ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలోని భువనగిరి కోట, కొలనుపాకలోని దేవాయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.