గరుడ వారధికి మరో రూ.25 కోట్లు
ABN , First Publish Date - 2021-07-30T07:20:21+05:30 IST
తిరుపతిలోని గరుడ వారధి పనుల ప్రగతిపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి గురువారం పరిపాలన భవనంలో మున్సిపల్ అధికారులతో సమీక్షించారు.
రెండో విడతగా కేటాయించిన టీటీడీ
తిరుపతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని గరుడ వారధి పనుల ప్రగతిపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి గురువారం పరిపాలన భవనంలో మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. టీటీడీ వాటాలో భాగంగా రెండోవిడతగా రూ.25 కోట్లను కేటాయించారు. దీంతో ఇప్పటివరకు టీటీడీ రూ50 కోట్లు విడుదల చేసినట్టయింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండు నుంచి నంది సర్కిల్ వరకు వారధి పనులు పూర్తికావచ్చాయని, ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొస్తామని కమిషనర్ గిరీష చెప్పారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఎస్ఈ మోహన్, ఎంఈ చంద్రశేఖర్, టీటీడీ ఎఫ్అండ్సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.