కామారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-18T23:46:35+05:30 IST

జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు

కామారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం

కామారెడ్డి: జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంఘటన మరువక ముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. జుక్కల్ మండలంలోని ఖండే బల్లుర్‌లో ఆ ఘటన చోటుచేసుకుంది. కల్టివేటర్‌ను బైక్ ఢీ కొంది.‌ దీంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులను కెంరాజ్ కల్లాలి గ్రామ వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 


జిల్లాలోని పెద్ద కొడపగల్ మండలం జగన్నాథ పల్లి గ్రామ శివారులోగల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన క్వాలిస్ వాహనం ఢీకొన్నది.  మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

Updated Date - 2021-12-18T23:46:35+05:30 IST