ఏపీ కేబినెట్లో వన్ టైం సెటిల్మెంట్ పథకంపై మరో పిల్లిమొగ్గ
ABN , First Publish Date - 2022-01-22T04:12:30+05:30 IST
ఏపీ కేబినెట్లో వన్ టైం సెటిల్మెంట్ పథకంపై మరో పిల్లిమొగ్గ
అమరావతి: ఏపీ కేబినెట్లో వన్ టైం సెటిల్మెంట్ పథకంపై మరో పిల్లిమొగ్గ వేసింది. ఓటీఎస్ పథకాన్ని ప్రజలు వ్యతిరేకిస్తుండడంతో వాయిదాల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఓటీఎస్ స్కీంను రెండు వాయిదాల్లో చెల్లించేలా కేబినెట్లో గృహ నిర్మాణశాఖ అధికారులు డ్రాఫ్ట్ను ప్రతిపాదించారు. కట్టాల్సిన మొత్తంలో ఉగాదికి ముందు రూ.5 వేలు, దీపావళికి ముందు రూ.5 వేలు చెల్లించేలా ముసాయిదా తీర్మానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో కీలక మార్పులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటు కల్పించింది.